బనారస్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ అర్ధరాత్రి తనిఖీ!

PM MODI

సోమవారం అర్థరాత్రి ప్రధాని మోదీ బనారస్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి వారణాసిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. పవిత్ర నగరానికి సాధ్యమైనంత ఉత్తమమైన మౌలిక సదుపాయాలను సృష్టించడం ప్రభుత్వ ప్రయత్నమని, రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు పరిశుభ్రమైన, ఆధునికమైన మరియు ప్రయాణీకులకు అనుకూలమైన రైల్వే స్టేషన్‌లను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

మోదీ వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *